తెలంగాణ రాష్ట్రంలో మరో 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 23, మంగళవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9553 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు మొత్తం 3006 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 220 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 652, మేడ్చల్ లో 112, రంగారెడ్డి లో 64, వరంగల్ రూరల్ లో 14, కామారెడ్డి లో 10, వరంగల్ అర్బన్ లో 9, జనగామ లో 7, నాగర్ కర్నూల్ లో 4, మంచిర్యాలలో 2, సంగారెడ్డిలో 2, మహబూబాబాద్ లో 2, మెదక్ లో ఒక కేసుతో కలిపి మొత్తం 879 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 219 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4224 కి చేరింది. ప్రస్తుతం 5109 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu