తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కోత్తగా ఒక్కరోజులోనే 1052 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 4, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,84,023 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,033 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.70 శాతంకాగా, మరణాల రేటు 0.58 శాతంగా నమోదైంది. ఇక గత 24 గంటల్లో 240 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,75,132 కు చేరుకుంది. ప్రస్తుతం 4,858 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం నాడు 42,991 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,98,40,610 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,01,735 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో మంగళవారం నాడు కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 94 కు చేరుకుంది. కాగా వీరిలో ఇప్పటికే 37 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. ఇక ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 50 మంది శాంపిల్స్ ను ఇప్పటికే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ