తెలంగాణలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు, అధికారులను అభినందించిన సీఎస్

Corona Vaccination Programme, COVID 19 Vaccine, Covid Vaccination, Covid-19 Vaccination, Covid-19 Vaccine Distribution, Distribution For Covid-19 Vaccine, Mango News, Telangana Covid-19 Vaccination Coverage Crosses 2 Cr Today, Telangana Cumulative Covid-19 Vaccination, Telangana Cumulative Covid-19 Vaccination Coverage, Telangana Cumulative Covid-19 Vaccination Coverage Crosses 2 Cr Today, Vaccine Distribution

రాష్ట్ర ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ మరియు జిల్లా అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల టీకాల లక్ష్యాన్ని సాధించడం పట్ల సీఎస్ సంబంధిత శాఖ అధికారులను అభినందించారు. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అధికారులు నిర్వీరామంగా కృషి చేస్తున్నారని సీఎస్ తెలిపారు. టీకా ప్రక్రియ జనవరి 2021 లో ప్రారంభమైందని, ఒక కోటి డోసులు జూన్ 25, 2021న అంటే 165 రోజుల్లో వేయడం పూర్తయిందని, మొత్తం 2 కోట్ల డోసులను సెప్టెంబర్ 15, 2021 వరకు అంటే 78 రోజులలో చేరుకున్నామని తెలిపారు.

ఈ నెలాఖరులోపు రాష్ట్రంలో మరో కోటి డోసులు వేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 52 శాతం అర్హులైన వారికి మొదటి డోసు ఇవ్వడం జరిగిందని, జీహెచ్‌ఎంసీలో దాదాపు అందరికి మొదటి డోసు టీకాలు వేశామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హై ఎక్స్ పోజర్ గ్రూప్‌లలో 38 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + fifteen =