తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1724 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 19, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 97,424 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 729 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.74% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1,195 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 75,186 కి చేరింది. ప్రస్తుతం 21,509 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 77.17 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 395, రంగారెడ్డి జిల్లాలో 169, మేడ్చల్ లో 105, కరీంనగర్ లో 101, వరంగల్ అర్బన్ లో 91, నల్గొండలో 67, సిద్దిపేటలో 61, నిజామాబాద్ లో 61, మంచిర్యాలలో 45, పెద్దపల్లిలో 43, ఖమ్మంలో 42, జోగులాంబ గద్వాల్ లో 37, రాజన్న సిరిసిల్లలో 37, జగిత్యాలలో 35, మెదక్ లో 34, వరంగల్ రూరల్ లో 32, మహబూబ్ నగర్ లో 32, కామారెడ్డిలో 32, వనపర్తిలో 28, మహబూబాబాద్ లో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 27 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu