తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేసిన నేపథ్యంలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ సిద్ధమైంది. సీజ్ చేసిన వాహనాలకు సంబంధిత రుసుము/జరిమానాను వసూలు చేసి ఆ వాహనాలు ఆయా యజమానులకు తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
లాక్డౌన్ సమయంలో పెద్దఎత్తున పట్టుకున్న వాహనాలను ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్ల వద్ద ఉంచారు. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్లలో జరిమానాలు చెల్లించి వాహనాలను తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా తీవ్రమైన కేసుల్లో పోలీసులు కోర్టుకి పంపితే ఆ వాహనాలకు కోర్టులోనే జరిమానా చెల్లించి విడిపించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే చట్టప్రకారం వాహనదారుడు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ