తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 1673 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 9, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,94,030 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 330 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,76,466 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.46 శాతంగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,042 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1165, మేడ్చల్ మల్కాజ్గిరిలో 149, రంగారెడ్డిలో 123, సంగారెడ్డిలో 44, హనుమకొండలో 34 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ