తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలులో బాసరకు పయనమవనున్నారు. కాగా ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వరుస ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పలువురు విద్యార్థులు ఆస్పత్రి పాలవడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై పర్యటన జరుగనుండటం గమనార్హం. ఈ క్రమంలో బాసర చేరుకున్న తర్వాత గవర్నర్ ముందుగా సరస్వతీ దేవీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శించి విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY