నేడు హైదరాబాద్లోని శాసనసభ కమిటీ హాలులో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు, బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కమిటీకి వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిని కమిటీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు సీఎస్ సోమేశ్కుమార్, ఐటీ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Minister Sri @KTRTRS addressed the Parliamentary Standing Committee on Commerce led by its Chairman Sri @VSReddy_MP which is on a study tour to Hyderabad on the subject ‘Promotion and Regulation of e-Commerce in India’. pic.twitter.com/RuaaFN6Poc
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 18, 2022
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ-కామర్స్పై కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ పాలసీలో భాగంగా.. ఈ-కామర్స్కు అనుబంధంగా ఉన్న ఆన్లైన్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ పేమెంట్స్ తదితర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ రంగంలో కేంద్రం విప్లవాత్మకమైన నిర్ణయాలను అమలు చేసినప్పుడే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే అన్ని రాష్ట్రాలలో డిజిటల్ లిటరసీ పైన దృష్టి పెట్టాలని సూచించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ నెట్’ ఇంటర్నెట్ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించాలని పార్లమెంట్ కమిటీ దృష్టికి తెచ్చారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనుందని, తద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయటానికి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ప్రక్రియను మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ