ప్రజలను మతాల పేరుతో ఘర్షణ పడమని ఏ దేవుడు చెప్పాడని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. నేడు దేశంలో, రాష్ట్రంలో కొందరు నాయకులు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, దీనిపై దృష్టి పెట్టకుండా బీజేపీ నాయకులు దేశంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. ఏ దేవుడు చెప్పాడు, ఏ మతం చెప్పింది ఎవరి దేవుడు గొప్ప అనే కాంపిటీషన్ పెట్టుకొని తన్నుకు చావండని? అని మంత్రి ప్రశ్నించారు. అభివృద్ధిపైన చిత్తశుద్దిలేని వారే ఇలాంటివాటిని ప్రోత్సహిస్తుంటారని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY