తెలంగాణ ఐసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, టీఎస్ ఐసెట్-2022 చైర్మన్, కాకతీయ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.రమేష్ విడుదల చేశారు. ఐసెట్ పరీక్షకు మొత్తం 68,781 మంది విద్యార్థులు హాజరుకాగా, 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, 89.57 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్సైట్ https://icet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇక ఐసెట్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన దంతాల పూజిత్వర్ధన్ మొదటి ర్యాంకు, కడపకు చెందిన అంబవరం ఉమేశ్ చంద్రరెడ్డి రెండో ర్యాంకు, గుంటూరుకు చెందిన కాట్రగడ్డ జితిన్సాయి మూడో ర్యాంకు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన ఎలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్, మంచిర్యాల జిల్లా హాజీపూర్ కు చెందిన ధర్మాజీ సతీశ్కుమార్ ఐదో ర్యాంక్ సాధించారు. ముందుగా రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2022 ప్రవేశ పరీక్షను జూలై 27, 28వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు ఫలితాలు విడుదల కాగా, త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY