తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఇంతకుముందు 2021 ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. అయితే మంగళవారం తనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని, రిజల్స్ లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని, గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఇక ఇటీవలే కాలిగాయం నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్.. పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇంతలోనే ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు.
Thought this was behind us but clearly it isn’t
After developing symptoms, got tested for Covid & it’s positive. Will be isolating at home
I request all who met with me over the last few days to kindly get tested & take precautions
— KTR (@KTRTRS) August 30, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ