తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1640 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 24, సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 52,466 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 15,445 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 455 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 40,334 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 11,677 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 76.8 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.86 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1640):
- జీహెచ్ఎంసీ – 683
- రంగారెడ్డి – 135
- సంగారెడ్డి – 102
- కరీంనగర్ – 100
- పెద్దపల్లి – 98
- కామారెడ్డి – 56
- నాగర్ కర్నూల్ – 52
- మహబూబాబాద్ – 44
- నల్గొండ – 42
- వరంగల్ అర్బన్ – 36
- మేడ్చల్ – 30
- జయశంకర్ భూపాలపల్లి – 24
- వరంగల్ రూరల్ – 22
- మెదక్ – 22
- రాజన్న సిరిసిల్ల – 20
- నిజామాబాద్ – 18
- వనపర్తి – 18
- జగిత్యాల – 17
- ములుగు – 14
- ఖమ్మం – 13
- భద్రాద్రి కొత్తగూడెం – 11
- మహబూబ్ నగర్ – 11
- యాదాద్రి – 11
- సూర్యాపేట – 11
- జనగామ – 10
- ఆదిలాబాద్ – 9
- వికారాబాద్ – 8
- సిద్ధిపేట – 8
- మంచిర్యాల – 7
- గద్వాల్ – 7
- నిర్మల్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu