తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 3, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,66,546 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,921 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారంనాడు 32,828 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 247 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,58,170 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.58 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,455 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ