తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 2137 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2137 కేసులతో కలిపి సెప్టెంబర్ 19, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1033 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 1,39,700 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 2192 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 30,573 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 25 లక్షలకు చేరువైంది. శనివారం నాడు 53,811 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 24,88,220 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 67,020 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu