తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 3052 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 12, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,581 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 778 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,06,678 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 92.21 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1772 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,131 యాక్టీవ్ కేసులు ఉండగా, ఇందులో 16,118 మంది హోం/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 406, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 301, నిజామాబాదులో 279, రంగారెడ్డిలో 248, జగిత్యాలలో 135, సంగారెడ్డిలో 123, నిర్మల్ లో 113, కామారెడ్డిలో 111, నల్గొండలో 109, ఆదిలాబాద్ లో 98, మహబూబ్ నగర్ లో 97, ఖమ్మంలో 95, కరీంనగర్ లో 87, వరంగల్ అర్బన్ లో 84 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ