ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11.30 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, కర్ఫ్యూ, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు సహా పెండింగ్ లో ఉన్న అంశాలు, రాష్ట్రంలో అమలు చేయనున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ