తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 771 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 1, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,617 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 289, రంగారెడ్డిలో 53, పెద్దపల్లిలో 49, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 47, యాదాద్రి భువనగిరిలో 33, కరీంనగర్ లో 31, నల్గొండలో 28, సిద్ధిపేటలో 27, మంచిర్యాలలో 21 నమోదయ్యాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,733 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 581 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,10,773 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాల రేటు 0.50 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY