ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత ‘అయ్మన్ అల్ జవహరి’ అల్జవహరి హతమైనట్లు అగ్రరాజ్యం పేర్కొంది. ఈ మేరకు అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. కాబూల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఎయిర్స్ట్రైక్స్ చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టి సమాచారాన్ని పైకి చేరవేశాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్ జవహరిని హతమార్చారు.
On Saturday, at my direction, the United States successfully conducted an airstrike in Kabul, Afghanistan that killed the emir of al-Qa’ida: Ayman al-Zawahiri.
Justice has been delivered.
— President Biden (@POTUS) August 1, 2022
“అల్ఖైదా నేత అల్జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’’ అని బైడెన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ స్పష్టం చేశారు. అల్ జవహరి మృతితో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయిన 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని ఆయన అన్నారు. కాగా 2011లో అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హతమైనప్పటి నుండి ఆ సంస్థ కార్యకలాపాలు చూసుకుంటున్న అల్ జవహరి తాజా మృతి తీవ్రవాద సంస్థకు అతిపెద్ద దెబ్బ అని అమెరికా అధికారులు తెలిపారు. అతని తలపై $25 మిలియన్ల బహుమతి ఉన్నట్లు వారు గుర్తు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY