ఇటలీలోని రోమ్లో జరిగిన క్యాడెట్ (U-17) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు భారత అండర్-17 బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “7 స్వర్ణాలతో సహా 14 పతకాలు (వాటిలో ఐదింటిని మహిళా అథ్లెట్లు గెలిచారు) మరియు 32 సంవత్సరాల తర్వాత గ్రీకో రోమన్లో ఒక స్వర్ణం సాధించారు. క్యాడెట్ (U-17) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. పతకాల పట్టికలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మన బృందానికి అభినందనలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ ఈవెంట్లో భారత్ మహిళా రెజ్లర్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ముస్కాన్ 40 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, 43 కేజీల విభాగంలో రితిక స్వర్ణం కైవసం చేసుకుంది. అలాగే 61 కేజీల విభాగంలో సవిత, 69 కేజీల విభాగంలో హర్షిత, 73 కేజీల విభాగంలో ప్రియ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY