తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో నిర్వహిస్తోన్న ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాతపరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 8, 9వ తేదీల్లో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. ఎస్సీటీ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ పేపర్లపై పరీక్ష జరగనుండగా.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే ఎస్సీటీ ఎస్ఐ (సివిల్) పోస్టులకు 9వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE