తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలవనున్నాయి. 2021-22 విద్యాసంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్కు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 55,662 మంది విద్యార్థులు హాజరు కానుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 204 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా నిర్ణయించారు. ఇక ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లు, నామినల్ రోల్స్ను.. www.bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. కృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
టెన్త్ క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్..
- ఆగస్ట్ 1వ తేదీ – ఫస్ట్ లాంగ్వేజ్
- ఆగస్ట్ 2వ తేదీ – సెకండ్ లాంగ్వేజ్
- ఆగస్ట్ 3వ తేదీ – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- ఆగస్ట్ 4వ తేదీ – మ్యాథమేటిక్స్
- ఆగస్ట్ 5వ తేదీ – జనరల్ సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయాలజీ)
- ఆగస్ట్ 6వ తేదీ – సోషల్ స్టడీస్
- ఆగస్ట్ 8వ తేదీ – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
- ఆగస్ట్ 10వ తేదీ – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY