తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 30, గురువారం నాడు విడుదల చేయనున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) ప్రకటించింది. గురువారం ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. పదో ఫలితాలను https://bse.telangana.gov.in/, https://bseresults.telangana.gov.in/ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY