హైదరాబాద్లోని రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు ఇతర దేశాలలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో రూ. 400 కోట్ల భారీ వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్మించింది.
రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో రూ. 400 కోట్ల భారీ వ్యయంతో, అత్యాధునిక హంగులతో తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్మించింది. సుమారు 3 ఎకరాలలో 3,70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిమించిన ఈ భవనంలో 2 బేస్ మెంట్స్, 10 అంతస్తులు ఉన్నాయి. భవనంలో మొత్తం 1,500 కంటే ఎక్కువ స్టార్టప్లను కలిగి ఉండేలా ఇది రూపొందించబడింది. 5 రోడ్ల కూడలిలో నిర్మించిన ఈ భవనానికి రాకపోకలకు అనువుగా రహదారులను 100-120 అడుగుల వెడల్పుతో నిర్మించారు. అలాగే దీనికి సమీపంలో రాయదుర్గం మెట్రోస్టేషన్ ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ఇంకా నగరంలోని ఐటీ కారిడార్లోనే ఈ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ హబ్ ద్వారా వివిధ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం లభించనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY