కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయంపై నిరసన తెలపడానికి తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పాలు, పెరుగు సహా ఇతర పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ క్యాడర్కు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని, దీనిలో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు స్థాయిల్లో ఎక్కడికక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా పాడి రైతులను భాగస్వాములు చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయా రైతులకు జీవనాధారమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడం వలన కలిగే నష్టాన్ని వివరించాలని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను విధించిందని, దీనిని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ