వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం పోలీసులు ప్రకటించారు. దీనికి ముందు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రచార బ్యానర్లకు, వాహనానికి నిప్పు పెట్టారు. బస్సుపై కిరోసిన్ పోసి అంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే ఆ సమయంలో షర్మిల బస్సులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షర్మిల గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా షర్మిలను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు, వైఎస్సార్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. ఇక షర్మిల పాదయాత్ర ఆదివారం 3,500 కి.మీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గిరిజన బహిరంగ సభలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నేటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE