టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో గల మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. నాయిని అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా మంత్రులు కేటిఆర్ మరియు శ్రీనివాస్గౌడ్ నాయిని పాడెను మోసి నివాళులు అర్పించారు. తమ ప్రియమైన నేతను కడసారి చూసేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu