గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ కమిటీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ కమిటీలను నియమించారు. అలాగే సికింద్రాబాద్కు భట్టి విక్రమార్క, చేవెళ్లకు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కు షబ్బీర్ అలీ, మల్కాజ్గిరికి జీవన్రెడ్డి, మెదక్ కు కుసుమకుమార్ లను పీసీసీ-కోఆర్డినేటర్లుగా నియమించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు డిసెంబర్ 1 న పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు పక్రియను డిసెంబర్ 4 న చేపట్టనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.
Parliamentary Constituency Wise Election Committees For GHMC Election. pic.twitter.com/nfmZ3thmQJ
— Telangana Congress (@INCTelangana) November 17, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ