రేపటి నుంచి తెలంగాణవ్యాప్తంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం – టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి పార్టీకి పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని వదిలి వెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానం పలికారు. మరోవైపు పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ పేరుతో ఒక కొత్త కార్యక్రమం చేపట్టనున్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా దీనిని ప్రారంభిస్తున్నట్లు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పురపాలక సంస్థల్లో, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మరో 10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని చెప్పారు. ఇక ఈ యాత్రల ద్వారా తెలంగాణలో ఎన్టీఆర్ మరియు చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి వివరిస్తామని, అలాగే పార్టీ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు కూడా స్వీకరిస్తామని కూడా కాసాని పేర్కొన్నారు. ఇక టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =