తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సంచలన ఫలితాలు సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పోరేషన్లలో మేయర్ పదవులు దక్కించుకుంది. ఇక 110 మున్సిపాలిటీల చైర్మన్ పదవులను టిఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకోగా, కాంగ్రెస్ నాలుగు, బీజేపీ 2, మజ్లీస్ 2 మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి. కొన్ని కారణాలవలన నేరేడుచర్ల మున్సిపాలిటీ ఛైర్మన్, మేడ్చల్ ఛైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు ఈ రోజు జరుగుతున్న కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ స్థానంలో మేయర్ పదవిని కూడా టిఆర్ఎస్ పార్టీ దక్కించుకోబోతుంది.
9 కార్పోరేషన్ల మేయర్ల వివరాలు:
- నిజామాబాద్ మేయర్: దండు నీతూకిరణ్
- రామగుండం మేయర్: బంగి అనిల్ కుమార్
- నిజాంపేట మేయర్: కొలన్ నీలారెడ్డి
- బోడుప్పల్ మేయర్: సామల బుచ్చిరెడ్డి
- జవహార్నగర్ మేయర్: మేకల కావ్య
- బడంగ్పేట్ మేయర్: చిగురింత పారిజాత
- మీర్పేట్ మేయర్: ముడావత్ దుర్గ
- బండ్లగూడ జాగీర్ మేయర్: మహేందర్ గౌడ్
- పీర్జాదీగూడ మేయర్: జక్కా వెంకట్రెడ్డి
[subscribe]