రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి సెప్టెంబర్ 16, గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
“మార్చి నెలలో జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చిన పట్టభద్రులకు, అద్భుత కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 16 ఉదయం 10:00 గంటలకు తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. కరోనా నిబంధనల నేపథ్యంలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేని పరిస్థితులు ఉన్నవి. కావున దయచేసి మీ అభినందనలను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయాలని కోరుతున్నాను” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ