ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పీజీసెట్-2021 నిర్వహణ బాధ్యతలను ఏపీ ఉన్నత విద్యా మండలి ఈసారి కడప యోగి వేమన యూనివర్సిటీకి అప్పగించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ (ఎయిడెడ్/ అన్ఎయిడెడ్) కాలేజీలు, మైనారిటీ కాలేజీలలో పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్సీ, ఎమ్సీజే, ఎంజేఎంసీ, ఎంఈడీ…మొదలైనవి) ఏపీ పీజీసెట్-2021ను నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 15, బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 30ను చివరి తేదీగా పేర్కొన్నారు. రూ.200 ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక అక్టోబర్ 22 నుంచి 26 వరకు పీజీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://sche.ap.gov.in/APPGCET వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ