ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదల

AP pg entrance exam 2021-2022, AP PGECET 2021, AP PGECET 2021 Notification, AP Post Graduate Common Entrance Test, AP Post Graduate Common Entrance Test 2021, AP Post Graduate Common Entrance Test 2021 Notification, AP Post Graduate Common Entrance Test 2021 Notification Released, AP Post Graduate Common Entrance Test Notification Released, Mango News, Notification for AP PGCET-2021 released, Post Graduate Common Entrance Test 2021 Notification

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ పీజీసెట్-2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పీజీసెట్-2021 నిర్వహణ బాధ్యతలను ఏపీ ఉన్నత విద్యా మండలి ఈసారి కడప యోగి వేమన యూనివర్సిటీకి అప్పగించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ (ఎయిడెడ్/ అన్‌ఎయిడెడ్) కాలేజీలు, మైనారిటీ కాలేజీలలో పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్సీ, ఎమ్సీజే, ఎంజేఎంసీ, ఎంఈడీ…మొదలైనవి) ఏపీ పీజీసెట్-2021ను నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 15, బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 30ను చివరి తేదీగా పేర్కొన్నారు. రూ.200 ఆలస్య రుసుముతో అక్టోబర్ 4 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక అక్టోబర్ 22 నుంచి 26 వరకు పీజీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను https://sche.ap.gov.in/APPGCET వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =