తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్ధ ఫియట్ తెలంగాణలో తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్సీఏ) దాదాపు 150 మిలియన్ డాలర్ల(సుమారు రూ.1,100 కోట్లు) పెట్టుబడులతో హైదరాబాద్లో గ్లోబల్ డిజిటల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ రోజు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. ఫియట్ గ్లోబల్ హబ్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశముందని మంత్రి కేటీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ