రాజ్భవన్లో శుక్రవారం గవర్నర్ తమిళిసై నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మహిళా దర్బార్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, అది ప్రజా దర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని మన దగ్గర గవర్నర్ కొత్తగా తీసుకొచ్చారని, నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఒక రాజకీయ పార్టీకి చెందిన మహిళా నేతలని విమర్శించారు.
ఇక సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీ పెట్టనున్నారని, రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా అధికారం చేపడతామని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని.. అలాగే ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వైఫల్యాలపై ప్రశ్నించే ఇతర పార్టీల నేతలపై మోదీ ప్రభుత్వం ఈడి, సీబీఐ, ఐటీ వంటి శాఖలతో దాడులు చేయిస్తున్నారని, గవర్నర్ వ్యవస్థపై మోదీ ప్రధాని కాకముందు ఒకమాట, అయ్యాక మరోమాట చెప్తున్నారని మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ