తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2817 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 2, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,33,406 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో 10 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 856 కి పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 15 లక్షలు దాటింది. బుధవారం నాడు 59,711 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 15,42,978 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 41,560 పరీక్షలు నిర్వహించారు.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 452, రంగారెడ్డి జిల్లాలో 216, కరీంనగర్లో 164, ఖమ్మంలో 157, నల్గొండలో 157, మేడ్చల్ లో 129, సిద్దిపేటలో 120, సూర్యాపేటలో 116, వరంగల్ అర్బన్లో 114, నిజామాబాద్లో 97, భద్రాద్రి కొత్తగూడెంలో 89, జగిత్యాలలో 88, సంగారెడ్డిలో 76, పెద్దపల్లిలో 75, యాదాద్రి భువనగిరిలో 73, మంచిర్యాలలో 71, మహబూబాబాద్లో 62, రాజన్నసిరిసిల్లలో 53 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 2, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 15,42,978
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 1,33,406
- కొత్తగా నమోదైన కేసులు : 2817
- నమోదైన మరణాలు : 10
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 1,00,013
- కరోనా రికవరీ రేటు: 74.9%
- యాక్టీవ్ కేసులు: 32,537
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 25,293
- మొత్తం మరణాల సంఖ్య : 856
- కరోనా మరణాల రేటు: 0.64%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu