తెలంగాణ రాష్ట్రంలో జూన్ 13, సోమవారం నుంచే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కొత్త విద్యాసంవత్సరంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే జూన్ 13 నుంచి జూన్ 30 వరకు విద్యార్థులకు బ్రిడ్జికోర్సును నిర్వహించనున్నారు. ఇక జూలై 1వ తేదీ నుంచి విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలను బోధించనున్నారు. జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే బ్రిడ్జికోర్సులో కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను విద్యార్థులు చదవాల్సి ఉంటుంది.
బ్రిడ్జి కోర్సులో భాగంగా ముఖాముఖి తరగతులుతో పాటుగా డిజిటల్ పాఠ్యాంశాలు కూడా నిర్వహించనున్నారు. బ్రిడ్జి కోర్సు కోసం 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగు స్థాయిలుగా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్ చొప్పున గతంలో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను విద్యార్థులకు భోదించనున్నారు. ఈ మేరకు తరగతుల వారిగా బోధించే పాఠ్యాంశాల షెడ్యూల్ను శుక్రవారం విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. కాగా డిజిటల్ పాఠ్యాంశాలు టీశాట్ చానల్ ద్వారా కొనసాగుతాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY