తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ఖాళీ చేతులతో వచ్చిన ప్ర‌ధాని మోదీ రాష్ట్రానికి ఏం సాయం చేస్తారు? – ఎమ్మెల్సీ క‌విత

TRS MLC Kalvakuntla Kavitha Fires on PM Modi Tour of Telangana Today,TRS MLC Kalvakuntla Kavitha,PM Modi Tour of Telangana,Kavitha Fires on PM Modi,Mango News,Mango News Telugu,PM Narenndra Modi,Narendra Modi Telangana Tour, Modi Telangana Tour,Kalvakuntla Kavitha,Narendra Modi,Modi Latest News And Updates,Modi Tour Of Telangana, BRS Party, Telangana CM KCR,MLC Kalavakuntla Kavitha,Kavitha Latest News And Updates

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. శనివారం ఆమె జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం రాయిక‌ల్ మండ‌లం కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ఖాళీ చేతులతో వచ్చిన ప్ర‌ధాని మోదీ రాష్ట్రానికి ఏం సాయం చేస్తారు? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారని, అయితే ఇంతవరకు సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ప్రధాని నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదని అన్నారు. ఈ విషయాన్ని జ‌గిత్యాల ప్రజలంతా గమనించాలని, అలాగే ఉత్తుత్తి మాటలు చెప్పేదెవరో, అభివృద్ధి చేసే నాయకులేవరో ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఇక జగిత్యాలను సంజయ్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికోసం పట్టుదలతో పనిచేస్తున్న సంజయ్‌కి తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్సీ క‌విత భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 13 =