తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 546 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 7 వేలు దాటింది. కొత్తగా నమోదైన 546 కేసులతో కలిపి జూన్ 20, శనివారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7072 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు మొత్తం 3188 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 203 కి పెరిగినట్టు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా జీహెచ్ఎంసీ ఏరియాలో 458 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 50, కరీంనగర్ లో 13, జనగామ లో 10, మేడ్చల్ లో 6, మహబూబ్ నగర్ లో 3, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాలలో 2 కేసులు చొప్పున, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్ లో ఒక్కోకేసు చొప్పున మొత్తం 456 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 154 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3506 కి చేరింది. ప్రస్తుతం 3363 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu