నేడు రక్షా బంధన్ సందర్భంగా తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. శుక్రవారం ప్రగతి భవన్లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సోదరుడు, మంత్రి కేటీఆర్కు, కవిత రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. తోబుట్టువుల బంధం అన్నింటి కంటే అందమైనదని, రక్షా బంధన్ జరుపుకోవడం ద్వారా ఆ బంధాన్ని మరింతగా బలపరుచుకునే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF