తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో.. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలను కమిషన్ ఛైర్మన్ వివరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణ వంటివాటిపై ఏం చేయాలనే దానిపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ భేటీలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎం కేసీఆర్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణిస్తున్నారని, ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయవచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ భేటీలో ఏం జరగనుందో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE