ఏపీకి పెట్టుబడుల కోసం సింగపూర్‌కు మంత్రి లోకేశ్‌.. ఎన్నారైల ఘన స్వాగతం

Minister Nara Lokesh Received Grand Welcome by NRIs During Singapore Visit

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల వేటలో భాగంగా సోమవారం సింగపూర్‌లో పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం

ఆదివారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన మంత్రి లోకేశ్ సోమవారం ఉదయం సింగపూర్ చేరుకున్నారు. స్థానిక విమానాశ్రయంలో తెలుగు ఎన్నారైలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎన్నారైలతో జరిగిన సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సారథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించారు. ఎన్నారైలు తాము పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థల్లో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావించాలని, తద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని కోరారు.

కీలక భేటీలు – పెట్టుబడులపై చర్చలు

సింగపూర్ పర్యటనలో భాగంగా లోకేశ్ అత్యంత బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉన్నారు:

  • జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ: ఉదయం ఎంటీఐ (MTI) కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

  • పారిశ్రామికవేత్తలతో సమావేశం: సన్ టెక్ సిటీ వేదికగా కమోడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో, సీఎఫ్ఓలతో పాటు ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

  • రాష్ట్రంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు ఏర్పాటు కావడం పట్ల ఎన్నారైలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here