తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి సహా సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రిల పదవీ కాలం డిసెంబర్ 17తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీలో సభ్యుడైన డి.కృష్ణారెడ్డి తాత్కాలిక ఛైర్మన్గా నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీకి పూర్తిస్థాయి ఛైర్మన్ నియామకం జరిగేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ