తెలంగాణ ఆర్టీసీ మరోసారి చార్జీలను పెంచింది. ఇటీవలే రౌండప్ పేరుతో ఒకసారి చార్జీలు పెంచిన ఆర్టీసీ, తాజాగా మరోసారి డీజిల్ సెస్ పేరుతో చార్జీలు పెంచింది. ఈ పెరిగిన చార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులపై ఒక్కో ప్రయాణికుడికి రూ.2, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో, డీ లక్స్ సర్వీసులపై ఏప్రిల్ 9న తొలి బస్సులు బయలుదేరే నాటి నుంచి ఒక్కో ప్యాసింజర్కు రూ.5 చొప్పున డీజిల్ సెస్ విధించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ధర రూ.10 అలాగే ఉంటుంది. హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డి) ధర క్రమంగా పెరుగుతుండటంతో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులపై భారం పడింది. టిఎస్ఆర్టిసి అధికారుల ప్రకారం, బస్సులు లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలను అందించడానికి దాని కార్యకలాపాల కోసం ప్రతిరోజూ ఆరు లక్షల లీటర్ల హెచ్ఎస్డిని వినియోగిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో హెచ్ఎస్డి ధర అసాధారణంగా పెరిగింది. బల్క్ వినియోగదారుల హెచ్ఎస్డి ధర డిసెంబర్, 2021లో లీటరుకు రూ. 83 నుండి ఇప్పుడు లీటరుకు రూ.118కి పెరిగింది. దీంతో కార్పొరేషన్ వ్యయం భారీగా పెరిగింది. అయితే గత కొద్ది రోజులుగా పెరిగిన ఖర్చులను కొంతమేరకు తగ్గించుకునేందుకు ప్రయాణికులపై సెస్ను విధించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని టీఎస్ఆర్టీసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులపై భారం మోపే ఉద్దేశం రవాణాశాఖకు లేదని, అయితే బస్సులు రోడ్లపై తిరగాలన్నా, ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చాలన్నా ప్రధాన వనరు ఇంధనమే అని, అయితే జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఇంధన ధరల పెంపు వల్ల సంస్థను తీవ్ర నష్టాల బారి నుంచి బయటపడేయాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదని పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ