తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 31, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,898 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,027 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శుక్రవారం నాడు 36,759 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 222 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,74,221 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,650 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 67గా ఉంది. కాగా వీరిలో ఇప్పటికే 27 మంది ఈ వేరియంట్ నుంచి కోలుకునట్టు తెలిపారు. మరోవైపు 27 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ