తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. దీంతో గతకొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కొత్తగా 2207 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 6, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 75,257 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 601 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.79% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1136 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 53,239 కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 70.7 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 532, రంగారెడ్డి జిల్లాలో 196, వరంగ్ అర్బన్ లో 142, మేడ్చల్ లో 136, కామారెడ్డిలో 96, కరీంనగర్ లో 93, నిజామాబాద్ లో 89, జోగులాంబ గద్వాల్ లో 87, ఖమ్మంలో 85, భద్రాద్రి కొత్తగూడెంలో 82, పెద్దపల్లి 71, జనగామలో 60, మహబూబ్ నగర్ లో 51, సంగారెడ్డిలో 37, నాగర్ కర్నూల్ లో 36, జగిత్యాలలో 36, మంచిర్యాలలో 35, మెదక్ లో 32, జయశంకర్ భూపాలపల్లిలో 29, నల్గొండలో 28, సిద్దిపేటలో 28, రాజన్న సిరిసిల్లలో 25, వికారాబాద్ లో 24, సూర్యాపేటలో 23, యాదాద్రి భువనగిరిలో 23, మహబూబాబాద్ లో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu