జూన్ 20 వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించి, పరీక్షల నిర్వహణకు సంబంధించి జేఎన్టీయూ-హైదరాబాద్ ఇటీవలే పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూహెచ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకవడంతో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తిరిగి మళ్ళీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ప్రకటించనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu