బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 16, 17 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 16న అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17, 2022 నుంచి సెప్టెంబర్ 17, 2023 వరకు “హైదరాబాద్ విమోచన దినోత్సవం” ను ఏడాదిపాటు జరుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఏడాది పాటుగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే సెప్టెంబర్ 17న రాష్ట్రంలోని అన్ని జిల్లాల బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర రాష్ట్రస్థాయి ముఖ్య నేతలతో కూడా అమిత్ షా సమావేశం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY