ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమవ్వడం తెలిసిందే. అయితే ఈ భేటీలో సీపీఎస్పై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సమావేశం అసంపూర్తిగా ముగిసింది. భేటీ అనంతరం ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. చర్చల్లో భాగంగా మంత్రి బొత్స గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) విధానానికి ఒప్పుకోవాలని కోరగా, ఆయన ప్రతిపాదనను అంగీకరించబోమని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జీపీఎస్పై ఉద్యోగులకున్న అభ్యంతరాలు తెలియజేయాలని మంత్రి బొత్స సూచించగా, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. దీంతో ఈ అంశంపై మరింత స్పష్టత కోసం రేపు ఇరు వర్గాలు మరోసారి చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. దాదాపు 20 మంది ఉద్యోగ సంఘాల నేతలను బుధవారం సాయంత్రం చర్చలకు రావాల్సిందిగా కోరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY