ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు వివాదం మరో మలుపు తీసుకుంది. ఈ అంశంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ తొలగింపు పిటిషన్లపై ఈ రోజు తీర్పు వెల్లడిస్తూ, ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవో లను రద్దు చేస్తునట్టు ప్రకటించింది. నిమ్మగడ్డ రమేశ్కుమార్ నే తిరిగి ఎస్ఈసీగా నియమించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ పదవీ కాలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను కోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్సు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు వెల్లడించింది.
ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేశ్కుమార్ ను తొలగించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11 న ఆయన విజయవాడలో ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టారు. తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu