ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవో లను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్కుమార్ నే తిరిగి ఎస్ఈసీగా నియమించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది, అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసిందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu