తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మే 29, శుక్రవారం నాడు ఆవిష్కృతం అయింది. ముందుగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మర్కూక్ పంప్హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.
అనంతరం త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మర్కూక్ పంప్హౌస్ స్విచ్చాన్ (ప్రారంభం) చేశారు. పంప్ హౌస్ స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్లోకి చేరుకున్నాయి. తర్వాత ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ వద్దకు వచ్చి సీఎం కేసీఆర్ గోదావరి జలాలకు స్వాగతం పలికి, గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu